3rd ODI: భారత్ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది.
By - అంజి |
3rd ODI: భారత్ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రోహిత్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో ఒకే వికెట్ కొల్పోయి ఛేదించింది. రోహిత్ సూపర్ సెంచరీ (121*)తో చెలరేగగా కోహ్లీ అర్థ సెంచరీ (74*) నాటౌట్గా నిలిచారు. కెప్టెన్ గిల్ (24) మరోసారి నిరాశపరిచినప్పటికీ.. సీనియర్లు అద్భుత ప్రదర్శనతో వైట్వాష్ గండాన్ని తప్పించారు. కాగా తొలి 2 మ్యాచ్ల్లో ఓటమితో భారత్ సిరీస్ కొల్పోయిన విషయం తెలిసిందే.
Hitman has RO-ared with all class in Sydney! 💯👉 His 33rd ODI century, 50th across formats👉 9 - Joint-most 100s in ODIs against AUS👉 6- Most 100s by a visiting batter in ODIs in AUS#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuANAu pic.twitter.com/r5AtoC6u1i
— Star Sports (@StarSportsIndia) October 25, 2025
2 సిక్సర్లు, 11 ఫోర్లతో రోహిత్ శర్మ 33వ శతకం బాదారు. చివరిసారి ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంచరీ నమోదు చేశారు. ఇక గత మ్యాచులో రోహత్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అటు ఆస్ట్రేలియాలో 2500 రన్స్ పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడిగా ఆయన నిలిచారు. అంతకుముందు సచిన్ ఈ ఫీట్ సాధించారు.