Fact Check : భారత్ లోని మురికివాడల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారా..?
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Aug 2020 2:11 PM IST![Fact Check : భారత్ లోని మురికివాడల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారా..? Fact Check : భారత్ లోని మురికివాడల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారా..?](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/08/Photo-showing-miserable-living-conditions.jpg)
భారతదేశంలోని మురికివాడల్లో ప్రజలు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారని.. అందుకు సాక్ష్యమే ఈ ఫోటోలు అంటూ మురుగునీటి పైపుల్లో పిల్లలు, పెద్దలు, కుటుంబాలు నివాసం ఉంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
మలయాళంలో పెట్టిన ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. రామ మందిరం నిర్మాణం జరుగుతోందని మనం ఆనంద పడుతున్నాం. కానీ వీధుల్లో కనీసం తలదాచుకోడానికి చోటు లేని వారు ఎంతో మంది ఉన్నారంటూ పోస్టు పెట్టారు. మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
భారతదేశంలో డ్రైనేజ్ పైపుల్లో జనం బ్రతుకుతున్నారంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టులో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోను ఫైజల్ ఆజిమ్ అనే వ్యక్తి తీశారు. Atkins Cityscape అవార్డును 2014లో సొంతం చేసుకుంది ఈ ఫోటో..!
The Guardian’s Atkins CIWEN ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2014 విజేతల లిస్టులో ఈ ఫోటో వచ్చింది. ఈ ఆర్టికల్ కథనం ప్రకారం 2013లో ఈ ఫోటోను బాంగ్లాదేశ్ లో తీశారు. "లైఫ్ ఇన్ ది సర్కిల్" అంటూ బాంగ్లాదేశ్ లోని పరిస్థితిని ఆయన చూపించారు.
Daily Mail, My Green Pod, Amateur Photographer లాంటి వెబ్ సైట్స్ ఈ అవార్డు గెలిచిన ఫోటోగ్రాఫ్ ను ప్రచురించాయి.
ఈ ఫోటోను తీసింది ఫైజల్ ఆజిమ్ అంటూ ప్రముఖ జర్నలిస్ట్ కాంచన్ గుప్తా షబానా అజ్మీకి ట్వీట్ ద్వారా తెలిపారు. బాంగ్లాదేశ్ కు చెందిన ఫైజల్ ఆజిమ్ ఈ ఫోటోను తీశారని.. ఆయనకు క్రెడిట్ ఇవ్వాలని కాంచన్ గుప్తా తెలిపారు. ఈ ఫోటోగ్రాఫ్ తీసినందుకు ఆయనకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
I'd request Ms @AzmiShabana to give due credit to the photographer: Faisal Azim of Bangladesh. This photograph fetched him the Atkins CIWEM Award in 2014.
— Kanchan Gupta (@KanchanGupta) June 25, 2020
[The photograph is of shantydwellers in Dhaka who lost their homes after a fire destroyed their shanties in 2014.] https://t.co/Y2KQg0NuDZ pic.twitter.com/Qm0BIITm6a
భారత్ లోని మురికివాడల్లో ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారంటూ వైరల్ అవుతున్న ఫోటో భారత్ కు చెందినది కాదు. 2013 లో బాంగ్లాదేశ్ లో ఫైజల్ ఆజిమ్ తీసిన ఫోటో. 2014లో ఈ ఫోటోకు అవార్డులు కూడా లభించాయి.