రెప్పపాటు కాలంలో లక్ష రూపాయలు దోచుకుని వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. రోడ్డు ప్రమాదం జరగడంతో కిందపడి లేచే లోపే లక్ష రూపాయల విలువ చేసే బ్యాగ్ తో ఉడాయించారు ఆ అజ్ఞాత వ్యక్తులు. ఈ సంఘటన హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్- 5 మెయిన్ రోడ్డుపై చోటుచేసుకుంది. బాధితుడు ప్రైవేట్ ఉద్యోగి. కన్నీరు మున్నీరై నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.