బంగ్లాదేశ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు అక్క‌డికే వెళ్లండి.. దీదీపై యోగీ ఫైర్‌

బెంగాల్ హింసాకాండపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

By Medi Samrat
Published on : 15 April 2025 3:02 PM IST

బంగ్లాదేశ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు అక్క‌డికే వెళ్లండి.. దీదీపై యోగీ ఫైర్‌

బెంగాల్ హింసాకాండపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బెంగాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అమర యోధుడు రాజా నర్పతి సింగ్ విజయోత్సవం సందర్భంగా మంగళవారం హర్దోయ్ జిల్లాలోని రుయా గర్హిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడుతూ.. అల్లరిమూకలను శాంతి దూతలుగా మమతా బెనర్జీ పిలుస్తారని అన్నారు. బంగ్లాదేశ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు బంగ్లాదేశ్‌కు వెళ్లాలని అన్నారు. అల్లరి మూకలకు కర్ర ఒక్కటే మందు అని.. దయ్యాలు మాటలతో ఏకీభవించవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. వారం రోజులుగా బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ మొత్తం కాలిపోతోంది. కొంతమంది బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తే అక్కడికి వెళ్లి ఉండాల్సింది. ఓ ప‌క్క‌ బెంగాల్ కాలిపోతుందని.. అయినా ముఖ్యమంత్రి పనిలేకుండా కూర్చున్నారన్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లను చేపట్టాయని.. అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

మాఫియా ఖాళీ చేసే భూమిలో ఆసుపత్రులు నిర్మిస్తామని యోగి అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనమందరం నమ్మాలి. ఇది న‌వీన‌ భారతదేశం.. 2047లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా మారడాన్ని ఎవరూ ఆపలేరు అన్నారు.

Next Story