సిద్ధరామయ్యపై కుమారుడి సంచలన ఆరోపణలు

కర్ణాటక రాజకీయాలను కదిలించే ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By -  Medi Samrat
Published on : 22 Oct 2025 8:20 PM IST

సిద్ధరామయ్యపై కుమారుడి సంచలన ఆరోపణలు

కర్ణాటక రాజకీయాలను కదిలించే ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి తన రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్నారని, క్యాబినెట్ సహోద్యోగి సతీష్ జార్కిహోళికి మార్గదర్శకుడిగా మారాలని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు సాధ్యమవుతుందనే ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడానికి సతీశ్ ఝర్కిహోళి అర్హుడని యతీంద్ర అన్నారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మార్పు అంశంపై సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉన్నాయి. బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర పాల్గొన్నారు. రాజకీయాల్లో తన తండ్రి చివరి దశలో ఉన్నారని, ఈ సమయంలో బలమైన, ప్రగతిశీల భావజాలం కలిగిన నాయకుడు ఆయనకు అవసరమని అన్నారు. అటువంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకంగా ఉంటారన్నారు. సతీశ్‌కు ఆ లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు ఆయన సరైన వ్యక్తి అని యతీంద్ర అన్నారు.

Next Story