ఈ జన్మలో బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను : సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Will rather die than join hands with BJP again. ఈ జన్మలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో మళ్లీ పొత్తు పెట్టుకోనని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం అన్నారు.

By Medi Samrat  Published on  30 Jan 2023 10:40 AM GMT
ఈ జన్మలో బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోను : సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ జన్మలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో మళ్లీ పొత్తు పెట్టుకోనని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం అన్నారు. 'నేను చనిపోయే వరకు బీజేపీతో వెళ్లను. మరణాన్ని అంగీకరిస్తాను కానీ బీజేపీతో వెళ్లను’’ అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని, బీజేపీ బలవంతంగా సీఎం చేసిందన్నారు. ఎన్నికలు జరగనివ్వండి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీల యుగాన్ని గుర్తు చేసుకున్నారు. "మేము అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీలను గౌరవిస్తాము. అందువల్ల ఎల్లప్పుడూ వారికి అనుకూలంగా ఉన్నాము" అని ఆయన చెప్పారు.

అంతకుముందు బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ.. "ఆదరణ లేని" ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పునర్వ్యవస్థీకరణ ప్రశ్నే లేదని అన్నారు. "నితీష్ కుమార్ ప్రజాదరణ పొందలేదు. నితీష్‌కు జనాదరణ లేని కారణంగా.. 2020 అసెంబ్లీ ఎన్నికలలో JD(U) అనేక స్థానాలను కోల్పోయింది. ఎన్నికలలో బీజేపీ చాలా బాగా పని చేసిందని జైస్వాల్ అన్నారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్‌ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో కూడా ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు.


Next Story