మొరాయించిన వాట్సాప్

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ శనివారం భారతదేశంలో మొరాయించింది.

By Medi Samrat
Published on : 12 April 2025 9:07 PM IST

మొరాయించిన వాట్సాప్

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ శనివారం భారతదేశంలో మొరాయించింది. వినియోగదారులకు సందేశాలు పంపలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు స్టేటస్ అప్‌లోడ్ చేయలేకపోయామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వినియోగదారులు వాట్సాప్ యాప్ లేదా వాట్సాప్ వెబ్ ద్వారా కనెక్ట్ అవ్వలేకపోయారు లేదా సందేశాలు పంపలేకపోయారు. ఎటువంటి కాల్‌లు చేయలేకపోయారు. ఫిబ్రవరి చివరలో కూడా వాట్సాప్‌లో భారీ అంతరాయం ఏర్పడింది, దీని వలన ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు యాప్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోయారు.

మరో వైపు ఈరోజు యూపీఐ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం తీవ్రంగా అంతరాయం కలిగిందని పలువురు వినియోగదారులు డిజిటల్ లావాదేవీలు చేయలేకపోతున్నామని తెలిపారు. ఇలా జరగడం ఒక నెలలోపు ఇది మూడవసారి. ఇంతలో, NPCI లావాదేవీ సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారుల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది: "NPCI ప్రస్తుతం అడపాదడపా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది, దీని వలన పాక్షిక UPI లావాదేవీలలో ఇబ్బందులు సంభవిస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము." అని తెలిపింది.

Next Story