అత్యాచార నిందితులకు 10 రోజుల్లో ఉరి.. రేపు అసెంబ్లీలో బిల్లు

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను దృష్టిలో ఉంచుకుని.. అత్యాచారం కేసులలో మరణశిక్షను నిర్ధారించడానికి బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల‌లో సవరణ బిల్లును తీసుకురాబోతోంది.

By Medi Samrat
Published on : 2 Sept 2024 6:29 PM IST

అత్యాచార నిందితులకు 10 రోజుల్లో ఉరి.. రేపు అసెంబ్లీలో బిల్లు

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను దృష్టిలో ఉంచుకుని.. అత్యాచారం కేసులలో మరణశిక్షను నిర్ధారించడానికి బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల‌లో సవరణ బిల్లును తీసుకురాబోతోంది. ప్రభుత్వం ఈ బిల్లుకు అపరాజిత మహిళా, శిశు సవరణ బిల్లు- 2024గా నామకరణం చేసింది. దీనిని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనిని మంగళవారం సభ ఆమోదించి గవర్నర్‌ సంతకం కోసం పంపనుంది.

ఈ సవరించిన బిల్లులో అత్యాచారం, హత్యలకు పాల్పడిన నిందితులకు 10 రోజుల్లోగా మరణశిక్ష విధించాలని నిబంధన పెట్టారు. భారీ జరిమానాతో పాటు. అత్యాచారం కేసులో దోషులకు చివరి శ్వాస వరకూ జీవిత ఖైదు విధించే నిబంధన ఉంది. రేపిస్టులకు ఆశ్రయం లేదా సహాయం అందించిన వారికి మూడు నుంచి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించే నిబంధన కూడా ఉంది.

Next Story