నటుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి

తమిళనాడులోని కరూర్‌లో శనివారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పిల్లలతో సహా 31 మంది మరణించగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

By -  Medi Samrat
Published on : 27 Sept 2025 9:36 PM IST

నటుడు విజయ్ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి

తమిళనాడులోని కరూర్‌లో శనివారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రచార ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పిల్లలతో సహా 31 మంది మరణించగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కారణంగా విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేయవలసి వచ్చింది. అంబులెన్సులు వెళ్లడానికి దారి ఇవ్వాలని విజయ్ కార్యకర్తలను, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. కరూర్ నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Next Story