స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ఎన్నికల ప్రసంగం చేస్తుండగానే..

మహారాష్ట్రలోని యవత్మాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వేదికపైనే స్పృహతప్పి పడిపోయారు.

By అంజి  Published on  24 April 2024 11:02 AM GMT
Union minister Nitin Gadkari,  poll rally ,Maharashtra, BJP

స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ఎన్నికల ప్రసంగం చేస్తుండగానే..

మహారాష్ట్రలోని యవత్మాల్‌లోని పూసాద్‌లో జరిగిన బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వేదికపైనే స్పృహతప్పి పడిపోయారు. వేదికపై ఉన్నవారు వెంటనే అతడిని పైకి లేపి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం గడ్కరీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సమాచారం ప్రకారం.. మహాయుతి అభ్యర్థి రాజశ్రీ పాటిల్ ప్రచార ప్రసంగంలో గడ్కరీ స్పృహతప్పి జారిపడి వేదికపై పడిపోయారు. జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గడ్కరీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి వేదికపై కుప్పకూలిపోయారు. అతని పార్టీ సభ్యులు వేగంగా చర్యలు తీసుకున్నారు, వారు వెంటనే సీనియర్ నాయకుడిని పట్టుకుని వైద్య సహాయం అందించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

గడ్కరీ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం ఇదే మొదటిసారి కాదు. 2018లో కూడా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అకస్మాత్తుగా వేదికపై స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన వెంట ఉన్నారు. వేదికపైనే ఉన్న గవర్నర్ స్వయంగా ఆయన్ను హ్యాండిల్ చేశారు.

Next Story