వారికి సంబంధించిన సమాచారం ఇస్తే 2.5 లక్షల రివార్డు

Umesh Pal murder case. ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌తో సహా మొత్తం ఐదుగురిని వాంటెడ్‌గా ప్రకటించారు

By M.S.R  Published on  5 March 2023 2:30 PM GMT
వారికి సంబంధించిన సమాచారం ఇస్తే 2.5 లక్షల రివార్డు

ఉమేష్ పాల్ హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు దారితీసే కీలక సమాచారాన్ని ఎవరైనా అందజేస్తేనే నిందితులకు రూ.2.5 లక్షల రివార్డు ఇస్తామని ఉత్తరప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకటించారు. ఉమేష్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌తో సహా మొత్తం ఐదుగురిని వాంటెడ్‌గా ప్రకటించారు. వీరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల రివార్డు ప్రకటించారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ ను ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని అతడి నివాసం వెలుపల కాల్చి చంపారు. ఐదుగురు నిందితులపై ధూమగంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌తో కలిసి ఉమేష్ పాల్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

కొద్దిరోజుల కిందట ఉమేష్‌పాల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అర్భాజ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్‌ వద్ద ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌, జిల్లా పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్‌కు కూడా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.


Next Story