తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మే 3న జర్మనీలోని బెర్లిన్లో బిజు జనతాదళ్ (బిజెడి) నాయకుడు పినాకి మిశ్రాను వివాహం చేసుకున్నారు. కృష్ణానగర్ నుండి రెండుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన మహువా మొయిత్రా ఒడిశాలోని పూరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పార్లమెంటేరియన్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో మొయిత్రా సాంప్రదాయ దుస్తులు, బంగారు ఆభరణాలతో ఉన్నారు. ఈ పెళ్లి ప్రైవేట్ గా సాగింది.
అక్టోబర్ 12, 1974న అస్సాంలో జన్మించిన మహువా మొయిత్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2010లో మమతా బెనర్జీ పార్టీలో చేరారు. మొయిత్రా 2019లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుండి లోక్సభకు తొలిసారి ఎన్నికయ్యారు. 2024లో కూడా తిరిగి ఎన్నికయ్యారు.
ఒడిశాలోని పూరిలో అక్టోబర్ 23, 1959న జన్మించిన పినాకి మిశ్రా, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త, సీనియర్ న్యాయవాది. ఆయన సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బి.ఎ (ఆనర్స్), ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లా ఫ్యాకల్టీ నుండి ఎల్.ఎల్.బి. పట్టా పొందారు. మిశ్రా తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్తో ప్రారంభించారు, 1996లో పూరి లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నారు. తరువాత ఆయన నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్లో చేరారు. 2009, 2014, 2019లో విజయాలను అందుకున్నారు.