ఐపీఎల్ ఫైనల్కు దూరంగా ఉండనున్న త్రివిధ దళాల అధిపతులు
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జూన్ 3న జరగనున్న ఐపీఎల్ ఫైనల్కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముగ్గురు సర్వీస్ చీఫ్లను ఆహ్వానించింది.
By Medi Samrat
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జూన్ 3న జరగనున్న ఐపీఎల్ ఫైనల్కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముగ్గురు సర్వీస్ చీఫ్లను ఆహ్వానించింది. అయితే.. ముగింపు వేడుకలకు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ హాజరుకావడం లేదని సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.
మంగళవారం BCCI సెక్రటరీ దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని జరుపుకోవడానికి మేము అన్ని భారత సాయుధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులు, సైనికులను ఐపీఎల్ ఫైనల్కు ఆహ్వానించాము. దేశ సాయుధ బలగాల 'శౌర్యం, ధైర్యం మరియు నిస్వార్థ సేవ'కు బీసీసీఐ సెల్యూట్ చేస్తుందన్నారు. ముగింపు వేడుకల్లో త్రివిధ దళాల బ్యాండ్లతో పాటు బీఎస్ఎఫ్కు చెందిన బ్యాండ్ కూడా ప్రదర్శన ఇవ్వాల్సి ఉందన్నారు.
అంతే కాకుండా స్టేడియంలో 1000 మంది సైనికాధికారులు, సైనికులు, వారి కుటుంబసభ్యులు కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదొక్కటే కాదు.. స్టేడియంలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్పై భారతదేశ వీరోచిత కథల సినిమాలను ప్రదర్శించాలని అనుకున్నారు. గురువారం ప్రభుత్వం నుంచి సూచనలు అందాయని, ఆ తర్వాత కార్యక్రమంలో మార్పులు చేశామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మ్యాచ్ ప్రారంభానికి ముందు బాలీవుడ్ గాయకులు దేశభక్తి గీతాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు.
స్టేడియంలోని పలు చోట్ల జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ఈ విధంగా ప్రదర్శించనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని అహ్మదాబాద్లో జరిగే ఐపీఎల్ ఫైనల్కు భారత సాయుధ దళాల అధిపతులు, ఉన్నతాధికారులు, సైనికులందరినీ ఆహ్వానించామని సైకియా అంతకుముందు చెప్పారు. దేశ సాయుధ బలగాల 'శౌర్యం, ధైర్యం మరియు నిస్వార్థ సేవ'కు బీసీసీఐ సెల్యూట్ చేస్తుందన్నారు.
ఆపరేషన్ సింధూర్ కింద దేశాన్ని రక్షించి, స్ఫూర్తినింపజేసిన 'గాలెంట్ ప్రయత్నాలను' ఆయన అభినందించారు. సైకియా మాట్లాడుతూ.. అభినందన చిహ్నంగా, ముగింపు వేడుకను సాయుధ దళాలకు అంకితం చేయాలని, మా హీరోలను సన్మానించాలని నిర్ణయించుకున్నామన్నారు.