మా పార్టీని గెలిపించండి.. ప్రతి ఇంటిలోని మహిళకు నెలకు రూ.5 వేలు ఇస్తాం..

TMC announces Rs 5,000 per month cash transfer scheme for women in Goa ahead of Assembly polls. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత గోవాలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ శనివారం ప్రకటించింది.

By అంజి  Published on  11 Dec 2021 10:49 AM GMT
మా పార్టీని గెలిపించండి.. ప్రతి ఇంటిలోని మహిళకు నెలకు రూ.5 వేలు ఇస్తాం..

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత గోవాలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. గృహ లక్ష్మి అనే పథకం కింద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మద్దతుగా ప్రతి ఇంటిలోని ఒక మహిళకు నెలకు రూ. 5,000 బదిలీ చేయబడుతుందని టీఎంసీ నాయకురాలు మహువా మోయిత్రా తెలిపారు. ఈ పథకం కోసం పార్టీ త్వరలో కార్డుల పంపిణీని ప్రారంభిస్తుందని, గోవాలో టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను కలిగి ఉన్న ఈ కార్డులు పనికి వస్తాయని ఆమె అన్నారు.

మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని 3.5 లక్షల కుటుంబాలకు చెందిన మహిళలు గృహ లక్ష్మి పథకం కిందకు వస్తారు. ఇది రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రస్తుత గృహ ఆధార్ పథకంలో తప్పనిసరి చేయబడిన గరిష్ట ఆదాయ పరిమితిని కూడా తొలగిస్తుందని టీఎంసీ గోవా ఇన్‌చార్జి మొయిత్రా అన్నారు.గోవాలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత పథకం మహిళలకు నెలకు రూ. 1,500 మాత్రమే అందజేస్తుందని, ఆదాయ పరిమితి కారణంగా 1.5 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

"గృహ ఆధార్ పథకం వాస్తవ అమలుకు సంవత్సరానికి రూ. 270 కోట్లు అవసరం, కానీ గోవా ప్రభుత్వం సంవత్సరానికి రూ. 140 కోట్లు మాత్రమే కేటాయించింది. దీని కారణంగా చాలా మంది ప్రజలు ప్రయోజనం పొందలేకపోతున్నారు" అని టీఎంసీ పార్లమెంటు సభ్యురాలు చెప్పారు. టీఎంసీ పథకం కోసం అంచనా వ్యయం గోవా మొత్తం బడ్జెట్‌లో ఆరు నుంచి ఎనిమిది శాతం ఉంటుందని ఆమె చెప్పారు. "కొవిడ్‌ దేశ ఆర్థిక వ్యవస్థను కుదించిందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి, దానిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది" అని మోయిత్రా అన్నారు.

Next Story