హనుమాన్‌ దేవుడికి రైల్వే అధికారుల నోటీసులు.. 10 రోజుల్లో గుడి ఖాళీ చేయాలని ఆదేశం

The railway officials have given notice to lord Anjaneya.. and ordered to vacate the temple within 10 days. ప్రభుత్వ భూమిని ఆక్రమించాడంటూ దేవుడికి నోటీసులు ఇచ్చారు రైల్వే అధికారులు.

By అంజి  Published on  12 Oct 2022 11:55 AM GMT
హనుమాన్‌ దేవుడికి రైల్వే అధికారుల నోటీసులు.. 10 రోజుల్లో గుడి ఖాళీ చేయాలని ఆదేశం

సాధారణంగా ప్రజలు.. ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే అధికారులు ముందస్తుగా నోటీసులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించాడంటూ దేవుడికి నోటీసులు ఇచ్చారు రైల్వే అధికారులు. వెంటనే గుడి ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ''హనుమాన్‌ జీ.. మీరు రైల్వే భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. ఇది చట్టరీత్యా నేరం. ఈ స్థలాన్ని 10 రోజుల్లోగా ఖాళీ చేయకపోతే, మీపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

హనుమాన్ వెంటనే ఆలయాన్ని ఖాళీ చేసి.. ఆ భూమిని రైల్వే సెక్షన్ ఇంజనీర్‌కు అప్పగించాలని నోటీసులో కోరారు. నోటీసు చివరి లైన్‌లో.. ''ఇది చాలా అవసరం అని భావించండి'' అని పేర్కొన్నారు. బెరక్‌బందల్ ఖాటిక్‌ ప్రాంతంలో ఉన్న ఆలయ గోడపై ఈ నోటీసును అతికించారు. అయితే రైల్వే నోటీసును స్థానికులు వ్యతిరేకించారు. ఆలయం ఉన్న ఖాటిక్‌ ప్రాంతంలో నివసిస్తున్న పలు కుటుంబాలకు భూ ఆక్రమణలకు సంబంధించి రైల్వే నోటీసులు పంపింది.

ఈ క్రమంలోనే హనుమాన్‌ ఆలయానికి కూడా భూ ఆక్రమణ కింద నోటీసు పంపారు. 1921 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నామని, పండ్లు, కూరగాయలు అమ్ముకోవడం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆక్రమణల కింద నోటీసులు అందుకున్న వారు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటోన్న ఇళ్లన్నీ ఖాళీ చేయాలని రైల్వే బృందం నోటీసులు అతికించింది. సోమ, మంగళవారాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయ సమీపంలోకి చేరుకుని రైల్వేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

Next Story