దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో తీవ్రవాదులకు జైలు శిక్ష

దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్‌ ముజాహిద్దీన్‌ తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష వింధించింది.

By అంజి  Published on  13 July 2023 7:58 AM GMT
NIA court, terrorists, National news, Mujahideen conspiracy, Mujahideen

దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో తీవ్రవాదులకు జైలు శిక్ష

దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్‌ ముజాహిద్దీన్‌ తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష వింధించింది. నలుగురు తీవ్ర వాదాలుకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితులు హైదరాబాద్‌, దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు రెక్కీ నిర్వహించారు. పేలుళ్ల కోసం నిందితులు ఆయుధాలు సైతం సమకూర్చుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన ఒబైద్-ఉర్-రహమాన్, బీహార్‌లోని దర్భంగాకు చెందిన ధనిష్ అన్సారీ, పూర్నియాకు చెందిన ఆఫ్తాబ్ ఆలం, మహారాష్ట్రలోని నాందెడ్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్‌లను 2013లో ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. వీరిని జులై 7వ తేదీన దోషులుగు నిర్ధారించిన NIA కోర్టు.. నేడు శిక్ష విధించింది. శిక్షతో పాటు డానిష్ అన్సారీకి రూ. 2,000, అఫ్తాబ్ ఆలమ్‌కు రూ. 10,000 జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

వీరు ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాదులతో కలిసి దేశంలో పలు పేలుళ్లకు కుట్ర పనిన్నట్టు ఎన్‌ఏఐ గుర్తించింది. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్ల, 2013లో దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్లలో నిందితుల పాత్ర ఉన్నట్టు తేలింది. గతంలో వారణాసి, ముంబయి, ఫజియాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరులో జరిగిన పేలుళ్లలోనూ నలుగురు నిందితుల పాత్ర ఉందని ఏఎన్‌ఐ తెలిపింది. జాతీయ దర్యాప్తు సంస్థ.. ఈ కేసులలో మొత్తం 11మందిని నిందితులుగా చేర్చింది. మిగతా ఏడుగురు నిందితుల్లో యాసిన్ బత్కల్, అక్తర్, రెహమాన్, తెహసిన్ అక్తర్, హైదర్ అలీ, రియాజ్ బత్కల్‌తో పాటు మరో నిందితుడు ఉన్నాడు. జైల్లో ఉన్న ఐదుగురు నిందితులపై విచారణ కొనసాగుతోంది.

నేరస్థులు ఇండియన్ ముజాహిదీన్ సభ్యులతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. భారత్‌కు చెందిన యాసిన్ భత్కల్‌లతో సహా ఇండియన్ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులతో ఈ నలుగురు చాలా సన్నిహతంగా ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. భారత్‌పై దాడికి కుట్ర పన్నినందుకు గాను ఈ నలుగురితో సహా చట్టవిరుద్ధమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన 11 మంది సభ్యులపై ఢిల్లీ కోర్టు మార్చి 31న అభియోగాలు నమోదు చేసింది.

Next Story