ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు

సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది

By -  Knakam Karthik
Published on : 17 Dec 2025 4:18 PM IST

National News, Delhi, Supreme Court, curb pollution, NHAI

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంలో విచారణ..NHAIకి నోటీసులు

ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ కాలుష్యానికి వాహనాలు కూడా ప్రధాన కారణం, వాయు కాలుష్య సంక్షోభం వార్షిక లక్షణంగా మారిందని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి దశలవారీగా అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి CAQM తన దీర్ఘకాలిక చర్యలను పునఃసమీక్షించాలని సుప్రీం ఆదేశించింది.

ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను సమర్ధవంతంగా అరికట్టడంలో అధికారులు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలమయ్యాయని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాలలను మూసివేయాలని, వాటిని హైబ్రిడ్ మోడ్ లో పనిచేయడానికి అనుమతించాలని ఢిల్లీ ప్రవర్తన ఇచ్చిన ఆదేశాలు పిల్లలను రక్షించడానికి ఉద్దేశించిన ఇటీవలి చర్యల అసమర్ధతను ఎత్తిచూపే విధంగా , అధికారులు తీసుకున్న తాత్కాలిక విధాన నిర్ణయాలు మాత్రమే అని పేర్కొంది.

టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌లు దేశ రాజధానిలోకి కాలుష్యానికి మూలంగా ఉన్నాయని పేర్కొంటూ దాఖలైన దరఖాస్తుపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) మరియు MCD లకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో MCD నిర్వహిస్తున్న తొమ్మిది టోల్ కలెక్షన్ బూత్‌లను NHAI నిర్వహించగల ప్రదేశాలకు మార్చే అవకాశాన్ని NHAI పరిశీలించాలి. అటువంటి ప్రదేశాలలో వసూలు చేసే టోల్‌లో కొంత భాగాన్ని MCDకి మళ్లించి తాత్కాలిక సస్పెన్షన్ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయవచ్చు" అని బెంచ్ పేర్కొంది

Next Story