క‌రోనా ప‌రిహారం చెల్లింపుల్లో జాప్యం.. ఏపీ, బీహార్ సీఎస్‌ల‌పై సుప్రీం అస‌హ‌నం

Supreme Court Summons Chief Secretaries of Andhra Pradesh and Bihar.క‌రోనా ప‌రిహారం చెల్లింపుల్లో జాప్యంపై దేశ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2022 6:50 AM GMT
క‌రోనా ప‌రిహారం చెల్లింపుల్లో జాప్యం.. ఏపీ, బీహార్ సీఎస్‌ల‌పై సుప్రీం అస‌హ‌నం

క‌రోనా ప‌రిహారం చెల్లింపుల్లో జాప్యంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఏపీ, బీహార్ రాష్ట్రాల‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు మ‌ధ్యాహ్నాం 2 గంట‌ల‌కు త‌మ ముందు విచార‌ణ‌కు ఏపీ, బీహార్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు హాజ‌రుకావాల‌ని జ‌స్టిస్ ఎంఆర్ షా ధ‌ర్మాస‌నం ఆదేశించింది. ఈ మేర‌కు స‌మ‌న్లు జారీ చేసింది. కొవిడ్‌ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఈరోజు విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది. చ‌ట్టానికి ఎవ‌రు అతీతులు కాద‌ని ఈ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్య‌నించింది.

Next Story