ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు ముందు శ‌శి థరూర్ షాకింగ్ నిర్ణయం

ఆపరేషన్ సింధూర్‌పై ఈరోజు పార్లమెంట్‌లో పెద్ద చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్‌పై పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.

By Medi Samrat
Published on : 28 July 2025 2:22 PM IST

ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు ముందు శ‌శి థరూర్ షాకింగ్ నిర్ణయం

ఆపరేషన్ సింధూర్‌పై ఈరోజు పార్లమెంట్‌లో పెద్ద చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్‌పై పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ చర్చకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ దూరంగా ఉన్నారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా ఆపరేషన్ సింధూర్‌పై 16 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. దీనిపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో వాడివేడి వాతావరణం నెలకొంది. అదే స‌మ‌యంలో ప్ర‌శ్న‌లు అడిగే వారి జాబితాలో శ‌శి థ‌రూర్ పేరు లేకపోవడంపై ఇప్పుడు ప్ర‌శ్న‌లు లేవనెత్తుతున్నాయి.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ సమయంలో, పాకిస్తాన్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకునే సమయంలో పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా, అనేక వైమానిక స్థావరాలపై క్షిపణులను కూడా ప్రయోగించారు. ఈ ఆపరేషన్ తర్వాత భారత ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా అందులో భాగమయ్యారు.

వర్గాల సమాచారం ప్రకారం.. ప్రతిపక్షం కూడా శశి థరూర్‌ను చర్చలో పాల్గొనమని ఆహ్వానించింది. అయితే ఆయ‌న‌ ఎటువంటి కారణం చెప్పకుండా చర్చలో పాల్గొనడానికి నిరాకరించాడు.

ఈ చర్చలో ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ, దీపేంద్ర హుడా, పరిణీతి షిండే, షఫీ పరంబిల్, మణిక్కం ఠాగూర్, రాజా బ్రార్ పాల్గొంటారు. అదే సమయంలో ప్రభుత్వం తరపున, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్‌పై చర్చను ప్రారంభిస్తారు. దీని తర్వాత విపక్షాల ప్రశ్నలకు హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తోపాటు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే సమాధానాలు ఇవ్వనున్నారు.

Next Story