కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ గురువారం AI ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రశంసించారు. శిఖరాగ్ర సమావేశం మొదటి కొన్ని రోజులు చాలా బాగా జరిగిందని ఆయన అన్నారు. అయితే, తరువాత కొన్ని అవాంతరాలు వచ్చాయని, ఏదైనా ప్రధాన కార్యక్రమంలో జరిగే విధంగానే ఇక్కడ కూడా అలాంటిదే జరిగిందని అని ఆయన అన్నారు. అనేక దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఇతర ముఖ్యమైన నాయకులు హాజరు కావడం ప్రత్యేకమని ఆయన అన్నారు. ఈ వ్యక్తులు AI అభివృద్ధిలో కొత్త, సమగ్ర ప్రపంచాన్ని చూడాలనే బలమైన కోరికతో వచ్చారన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్ను "అస్తవ్యస్తమైన PR షో"గా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించిన ఒక రోజు తర్వాత శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర సీనియర్ పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని విమర్శించారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శశి థరూర్ వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.