రిక్షా పుల్లర్‌ను 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన కారు.. పోలీసుల అదుపులో డ్రైవర్

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. న్యూఢిల్లీ ప్రాంతంలోని ఫిరోజ్ షా రోడ్‌లో నిర్లక్ష్యంగా

By అంజి  Published on  26 April 2023 6:35 AM GMT
Rickshaw-puller,  Delhi, Crime news

రిక్షా పుల్లర్‌ను 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన కారు.. పోలీసుల అదుపులో డ్రైవర్

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం అర్థరాత్రి దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. న్యూఢిల్లీ ప్రాంతంలోని ఫిరోజ్ షా రోడ్‌లో నిర్లక్ష్యంగా నడుపుతున్న కారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి రిక్షా పుల్లర్‌ను గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో బాధితుడికి సంబంధించిన చెప్పులు ఉన్నాయి. రహదారికి అడ్డంగా బాధితుడి రక్తం చిమ్మింది. ఢిల్లీలోని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, ప్రణవ్ తాయల్ మాట్లాడుతూ.. క్షతగాత్రుడిని చికిత్స కోసం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని, స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు.

బాధితుడిని మనోజ్ (25)గా గుర్తించారు, అతను హౌస్ కీపింగ్ పని చేస్తూ రిక్షా నడుపుతున్నాడు. ఘటనా స్థలం నుంచి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఘజియాబాద్ సమీపంలోని మురాద్ నగర్ నివాసి ఫర్మాన్ (25)గా గుర్తించిన డ్రైవర్‌కు వైద్య పరీక్షల ద్వారా అతను మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనేది తెలుస్తుందని తెలిపారు. ఫిరోజ్ షా రోడ్డులో కారు సైకిల్ రిక్షాను ఢీకొట్టిందని, ఆ తర్వాత మనోజ్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లిందని అధికారి తెలిపారు.

సంఘటనా స్థలానికి క్రైమ్ టీమ్ వచ్చిందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తాయల్ తెలిపారు. ప్రమాదానికి కారణమైప మారుతీ స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ముందు భాగం కూడా దెబ్బతింది. ఈ సంఘటన జనవరి 1న సంభవించిన భయంకరమైన కంఝవాలా ప్రమాద జ్ఞాపకాలను రేకెత్తించింది. ఆ సంఘటనలో 20 ఏళ్ల మహిళను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని దాదాపు 90 నిమిషాల పాటు వాహనం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Next Story