డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి పెరోల్ పై విడుదలయ్యారు. డేరా బాబాకు 40 రోజుల పెరోల్ మంజూరైంది. రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైలులో అత్యాచారం, హత్య కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా పెరోల్ పై విడుదల చేశారు. 2022 అక్టోబరులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు 40 రోజుల పెరోల్ వచ్చింది. హర్యానా పంచాయతీ ఎన్నికలు, అడంపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు సింగ్కు పెరోల్ మంజూరు అయింది.
సిర్సాలోని తన ఆశ్రమ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 2017 నుండి సునారియా జైలులో ఉన్నాడు. ఫిబ్రవరి 2022లో కూడా అతడికి మూడు వారాల పెరోల్ మంజూరు చేశారు. ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో 2017 ఆగస్టులో పంచకులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు సింగ్ను దోషిగా నిర్ధారించింది. శుక్రవారం నాడు ఆయనకు హర్యానా కోర్టు పెరోల్ మంజూరు చేయగా, జైలు నిబంధనలు పూర్తి చేసుకుని శనివారంనాడు రోహ్తక్ జిల్లా సునరియా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు.