తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారీ మార్పు చేయ‌నున్న‌ రైల్వే

రైల్వే టిక్కెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.

By Medi Samrat
Published on : 5 Jun 2025 8:34 AM IST

తత్కాల్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి భారీ మార్పు చేయ‌నున్న‌ రైల్వే

రైల్వే టిక్కెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఈ-ఆధార్ వెరిఫికేషన్ సదుపాయాన్ని భారతీయ రైల్వే త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్‌లో తెలియజేశారు. తద్వారా నిజమైన ప్రయాణికులు మాత్ర‌మే తత్కాల్ టికెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోగ‌లుగుతారు.

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వే త్వరలో ఈ-ఆధార్ వెరిఫికేషన్‌ను ప్రవేశపెడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని ద్వారా.. నిజమైన ప్రయాణీకులకు అవసరమైన సమయంలో కన్ఫర్మ్ చేసిన టిక్కెట్లను పొందడం సులభం అవుతుంది. టౌట్‌లను ఆపడం, నిజమైన ప్రయాణీకులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ కొత్త సిస్టమ్ యొక్క లక్ష్యం.

తత్కాల్ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు, IRCTC 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు లేదా ఏజెంట్ల ద్వారా ఈ IDలు అమలు చేయబడుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వే తన టికెట్ బుకింగ్ విధానాన్ని డిజిటల్‌గా పూర్తిగా ఆధునీకరించిందని తెలిపారు. వెబ్‌సైట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాంటీ-బాట్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది నకిలీ, ఆటోమేటిక్ బుకింగ్‌లను చేసే బాట్‌లను వెంటనే గుర్తించి బ్లాక్ చేస్తుందన్నారు.

Next Story