భటిండాలో పంజాబ్కు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ క్యాంపస్లో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహం కనిపించింది. మృతురాలిని కమల్ కౌర్ అలియాస్ కాంచన్ తివారీగా గుర్తించారు. ఆమె లూథియానాలోని లక్ష్మణ్ నగర్ నివాసి. ఆమె మృతదేహం దొరికిన వాహనం ఆమె పేరు మీద రిజిస్టర్ అయిందని అధికారులు నిర్ధారించారు. కాంచన్ సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ఆన్లైన్లో అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఆమె మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
లూథియానా పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ మాట్లాడుతూ, "భటిండా లోని అదేశ్ హాస్పిటల్ పార్కింగ్ స్థలంలో ఒక మహిళ మృతదేహం కనుగొనబడింది. ఆ మహిళను కమల్ కౌర్ అని గుర్తించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి వీడియోలను పోస్ట్ చేయడంలో ప్రసిద్ధి చెందారు." అని అన్నారు. తాము ఈ విషయాన్ని అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.