మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సంతకం చేసేసిన రాష్ట్రపతి

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇకపై..

By Medi Samrat  Published on  29 Sep 2023 2:40 PM GMT
మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సంతకం చేసేసిన రాష్ట్రపతి

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇకపై ‘నారీ శక్తి వందన్’ చట్టంగా రూపుదాల్చింది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం.. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌‌ను కల్పించనున్నారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ గురువారం రోజే మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సంతకం చేయగా.. శుక్రవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఈ బిల్లు చట్టంగా మారింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు సెప్టెంబర్ 20న లోక్‌సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జనాభా గణన నిర్వహించి, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ బిల్లు అమల్లోకి రానుంది.

Next Story