ప్రధాని మోదీపై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

PM Narendra Modi is illiterate in economics: Subramanian Swamy. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు.

By Medi Samrat  Published on  17 Jun 2023 9:00 AM GMT
ప్రధాని మోదీపై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన టార్గెట్ చేశారు. ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ‘‘దేశ జీడీపీ ఏటా 10 పది శాతం మేర పెరిగే అవకాశం ఉంది. కేవలం పదేళ్లలోనే నిరుద్యోగం, పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు ఏం చేయాలో తెలియదు. ఇక ఆర్థికశాస్త్రంలో మోదీ నిరక్షరాస్యుడు..అందుకే ఇలా..’’ అని ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

"It is pity that Indian economy which has the potential to grow at least 10 percent per year in GDP and thus end unemployment and eliminate poverty in less than 10 years. But MoF is clueless and Modi is illiterate in economics. So alas!!" అంటూ సుబ్రహ్మణ్య స్వామి పోస్ట్ పెట్టారు. గత కొద్దిరోజులుగా భారతీయ జనతా పార్టీకి చెందిన పలు పాలసీలను సుబ్రహ్మణ్య స్వామి విమర్శిస్తూ వస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఆయనను ఏమీ అనలేకపోతూ ఉన్నారు.


Next Story