గోవా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా

సోమవారం ప్రకటించిన గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-ఎంజిపి కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది.

By -  అంజి
Published on : 23 Dec 2025 1:08 PM IST

PM Modi, vote, BJP, Goa, Zilla Panchayat polls

గోవా జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ కూటమి సత్తా 

సోమవారం ప్రకటించిన గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-ఎంజిపి కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకుంది. 50 జెడ్‌పి సీట్లలో రెండు పార్టీలు 30 కి పైగా గెలుచుకోగా, కాంగ్రెస్ 10 సీట్లలో, ఆప్, రివల్యూషనరీ గోవాస్ పార్టీ ఒక్కో చోట విజయం సాధించాయి. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు.

ఈ విజయాన్ని ప్రధాని మోదీ అభినందించారు. “గోవా సుపరిపాలనతో నిలుస్తుంది. గోవా ప్రగతిశీల రాజకీయాలతో వెలుగొందుతుంది. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-ఎంజిపి (ఎన్‌డిఎ) కుటుంబానికి బలమైన మద్దతు ఇచ్చినందుకు గోవాలోని నా సోదరీమణులు, సోదరులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు.

Next Story