రైల్వేలో మైలురాయి, ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి..నేడే ప్రారంభం

జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.

By Knakam Karthik
Published on : 6 Jun 2025 7:07 AM IST

National News, Jammu Kashmir, PM Modi, Chenab Railway Bridge

రైల్వేలో మైలురాయి, ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి..నేడే ప్రారంభం

జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఈ వంతెనను ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఇది కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు రూ.35,000 కోట్ల వ్యయంతో నిర్మితమై, భారత రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. కాగా ప్రధాని మోడీ ఇవాళ జమ్మూకాశ్మీర్‌‌లో పర్యటిస్తారు. ఈ సందర్శనలో ఆయన ఉదయం 11 గంటలకు చీనాబ్ వంతెన డెక్‌ను సందర్శించి, దానిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత, భారతదేశంలోనే మొదటి కేబుల్-స్టేయ్డ్ రైల్వే వంతెన అయిన అంజీ ఖాద్ వంతెనను కూడా ప్రారంభిస్తారు.

రైల్వే బ్రిడ్జి ప్రత్యేకతలు..

బలమైన గాలులు, భూకంపాలను తట్టుకునేలా కట్టిన ఈ వంతెన నిర్మాణం ఓ ఇంజినీరింగ్‌ అద్భుతమని చెప్పటం అతిశయోక్తి కాదు. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలపగా.. ఇది పూర్తి కావడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా కశ్మీర్ లోయకు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఏర్పడింది. భూకంపాలు, గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలుల్ని తట్టుకోగల ఈ వంతెన జీవితకాలం 120 ఏళ్లు. ఆర్చ్ ఆకృతిలో నిర్మించిన ఈ రైల్వే బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు ఎక్కువ. నదీ గర్భం నుంచి ఈ బ్రిడ్జి 1,178 అడుగుల ఎత్తులో ఉంది.

Next Story