పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ అదిరే శుభవార్త

పీఎఫ్‌ (ప్రొవిడెంట్ ఫండ్) అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను చెప్పింది

By -  Knakam Karthik
Published on : 25 Sept 2025 8:36 AM IST

National News, Delhi, EPFO, Employees, PF account

పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ అదిరే శుభవార్త

ఢిల్లీ: పీఎఫ్‌ (ప్రొవిడెంట్ ఫండ్) అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను చెప్పింది. బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చందాదారులు సైతం ఏటీఎం నుంచి తమ పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ ప్రవేశపెట్టనుంది. త్వరలోనే జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వచ్చే నెల అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం.

ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ఈ ఏడాది 2025 జూన్ నెలలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందు కోసం బటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేసినట్లు తెలిపింది. అయితే, నగదు విత్ డ్రాలకు సంబంధించిన పరిమితి విధింపు గురించి బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అపసరం ఉందని, లిమిట్ విధించకపోతే భవిష్య నిధి అసలు లక్ష్యం నీరుగారి పోతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏటీఎం విత్ డ్రా అమలు వాయిదా పడింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయం వెలువడిన తర్వాత అందుబాటులోకి తీసుకురానున్నారు. అది కొత్త ఏడాది నుంచే ఉండనుందని సమాచారం.

ప్రస్తుతం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ లో 7.8 లక్షల మంది చందాదారులు ఉన్నారు. వారికి చెందిన దాదాపు రూ.28 లక్షల కోట్ల డబ్బులు ఈపీఎఫ్ వద్ద నిల్వ ఉన్నాయి. అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు పీఎఫ్ ఖాతాలోని డబ్బులను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీఎఫ్ ఖాతాలోని డబ్బులను చాలా సులభంగా తీసుకునేందుకు ఏటీఎం ద్వారా విత్ డ్రాకు అనుమతించాలని సంకల్పించింది. ఇందుకు అవసరమైన ఐటీ సేవలను సైతం సిద్ధం చేసింది. ఈ ఏటీఎం విత్ డ్రా సేవలను అందుబాటులోకి తీసుకు రావడానికి బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సైతం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. పీఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం మాదిరిగా ఒక ప్రత్యేక కార్డును ఈపీఎఫ్ఎ జారీ చేయనున్నట్లు సమాచారం, ఏటీఎం డెబిడ్ కార్డు మాదిరిగా ఈ కార్డు పని చేస్తుంది. నేరుగా ఏటీఎం కేంద్రానికి వెళ్లి పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను ఉ పసంహరించుకోవచ్చు. దీంతో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. అత్యవసర ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ సేవలు ఎంతగానో ఉపకరిస్తాయని కేంద్రం చెబుతోంది. అయితే ట్రస్టీల బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నాకే సగదు విత్ డ్రాలకు సంబంధించి పూర్తి స్పష్టత రానుంది.

Next Story