ఈ ఐదు రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తారు.. ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం

People in these 5 states drink the most alcohol. భారత్‌లో చాలా మంది మద్యానికి బానిసలయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలు మద్యం సేవిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం..

By అంజి  Published on  27 Feb 2022 8:28 AM GMT
ఈ ఐదు రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తారు.. ఆంధ్రప్రదేశ్‌ది మూడో స్థానం

భారత్‌లో చాలా మంది మద్యానికి బానిసలయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలు మద్యం సేవిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. దేశంలో దాదాపు 160 మిలియన్ల మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 95 శాతం మంది పురుషులు, 18 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. దేశం ప్రతి సంవత్సరం బిలియన్ల లీటర్ల మద్యాన్ని వినియోగిస్తుంది. సర్వే సంస్థ క్రిసిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020 సంవత్సరంలో దేశంలో విక్రయించిన మొత్తం మద్యంలో 45 శాతం ఐదు రాష్ట్రాలు వినియోగించాయి. దేశంలో అత్యధికంగా మద్యం సేవించే 5 ప్రాంతాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ పేరు మొదటి స్థానంలో ఉంది. దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో త్రిపుర రెండో స్థానంలో ఉంది. త్రిపురలో 34.7 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 13.7% మంది క్రమం తప్పకుండా మద్యం సేవిస్తున్నారు. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 34.5 శాతం మంది ప్రజలు నిత్యం మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో పంజాబ్ ఉంది. దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న పంజాబ్‌లో 28.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. నిత్యం తాగేవారి సంఖ్య 6 శాతం. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ఇక్కడి జనాభాలో 28% మంది మద్యం సేవిస్తున్నారు.

Next Story