భారత్‌ జవాన్‌ను తిరిగి అప్పగించిన పాక్‌

ఏప్రిల్ 23 నుండి పాక్‌ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను ఆ దేశం తిరిగి భారత్‌కు అప్పగించింది.

By అంజి
Published on : 14 May 2025 12:00 PM IST

Health benefits, mangoes, summer, Life style

మామిడి పండ్లు తింటున్నారా?.. అయితే ఈ లాభాలు తెలుసుకోండి

ఏప్రిల్ 23 నుండి పాక్‌ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ కుమార్‌ షాను ఆ దేశం తిరిగి భారత్‌కు అప్పగించింది. అటారీ - వాఘా బార్డర్‌ ద్వారా మన దేశానికి పంపింది. ఏప్రిల్‌ 23న తమ సరిహద్దులోకి అనుకోకుండా ప్రవేశించిన జవాన్‌ను పాకిస్తాన్‌ అదుపులోకి తీసుకుంది. అతని కోసం పాక్‌ రేంజర్లతో నిరంతరం ప్లాగ్‌ మీటింగ్స్‌, ఇతర మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు బీఎస్‌ఎఫ్‌ ప్రకటించింది. దీనికి ప్రతిఫలంగా భారత్‌ ఓ పాక్‌ జవాన్‌ను ఆ దేశానికి అప్పగించింది.

బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను బుధవారం ఉదయం భారత అధికారులకు తిరిగి అప్పగించారు. అమృత్సర్‌లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ అప్పగింత జరిగిందని, ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లను అనుసరించి శాంతియుతంగా జరిగిందని బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం షాను భద్రతా అధికారులు విచారిస్తున్నారు.

182వ బెటాలియన్‌కు చెందిన బిఎస్‌ఎఫ్ జవాన్ షాను ఏప్రిల్ 23న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలో అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటిన తర్వాత పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. షా తన సర్వీస్ రైఫిల్‌తో యూనిఫాంలో సరిహద్దు కంచె దగ్గర విధుల్లో ఉండగా విశ్రాంతి తీసుకోవడానికి నీడ ఉన్న ప్రాంతం వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో, అతను తెలియకుండానే పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. అక్కడ పాకిస్తాన్ రేంజర్లు అతన్ని పట్టుకున్నారు.

Next Story