పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల ఊహా చిత్రాలు విడుదల

కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన అనుమానిత ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి.

By Knakam Karthik
Published on : 23 April 2025 12:17 PM IST

National News, Pahalgam Terror Attack, Sketches Of Terrorists, Pm Modi, Amit Shah Pays

పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల ఊహా చిత్రాలు విడుదల

కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన అనుమానిత ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ప్రతినిధి అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ నిన్నటి దాడికి బాధ్యత వహించింది.

కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్‌కు చేరుకుని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పరిస్థితిని సమీక్షించారు. సౌదీ అరేబియాలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రయాణాన్ని ముగించుకుని త్వరగా భారత్‌కు వచ్చేశారు.

అంతకుముందు, ప్రధానమంత్రి ఉగ్రవాద దాడిని ఖండిస్తూ, బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. "ఈ దారుణమైన చర్య వెనుక ఉన్నవారిని న్యాయం ముందు నిలబెట్టడం జరుగుతుంది... వారిని వదిలిపెట్టం. వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయం సాధించదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం అచంచలమైనది, అది మరింత బలపడుతుంది" అని ప్రధాని మోడీ అన్నారు.

Next Story