ఆడపిల్లలు.. మన దేశ ఛేంజ్‌ మేకర్స్‌: ప్రధాని మోదీ

ఆడ పిల్లలు నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

By అంజి  Published on  24 Jan 2024 5:54 AM GMT
National Girl Child Day, PM Modi, Girls, National news

ఆడపిల్లలు.. మన దేశ ఛేంజ్‌ మేకర్స్‌: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఆడపిల్లలను ఛేంజ్‌ మేకర్స్‌ అని కొనియాడారు. వారు నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. వారి హక్కులు, విద్య, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి జరుపుకునే జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"జాతీయ బాలికా దినోత్సవం నాడు, మేము ఆడపిల్లల తిరుగులేని స్ఫూర్తి, విజయాలకు వందనం చేస్తున్నాము. అన్ని రంగాలలో ప్రతి ఆడపిల్ల యొక్క గొప్ప సామర్థ్యాన్ని మేము గుర్తించాము" అని ప్రధాని మోదీ అన్నారు. "ఆడ పిల్లలు మన దేశాన్ని, సమాజాన్ని మెరుగుపరిచే మార్పు-నిర్మాతలు. ప్రతి ఆడపిల్ల నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది" అని ప్రధాని మోదీ ఎక్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

పిల్లల లింగ నిష్పత్తిని పెంచడానికి మరియు వివిధ చర్యల ద్వారా బాలికలకు సాధికారత కల్పించడానికి మోదీ ప్రభుత్వం 2015లో ' బేటీ బచావో బేటీ పఢావో ' (కూతుళ్లను రక్షించండి, కుమార్తెలను చదివించండి) అనే పథకాన్ని ప్రారంభించింది .

కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆడ పిల్లల్లో సామాజిక అవగాహన పెంచి విద్య, ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఎన్నో రంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నా.. ఇంకా ఎక్కడో మహిళలు ఒకింత వెనుకబడే ఉన్నారనే భావనలో ఉన్నారు. మహిళలు ధీర వనితలుగా తమ సత్తాను చాటుతున్నా కూడా.. ఆడపిల్ల పుట్టిందని బాధపడే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. వీటన్నింటిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలిక అభివృద్ధి మిషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

దీనిలో భాగంగానే బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, పోషకాహారం సామాజిక ఎదుగుదల, ఆడపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆడవాళ్లు వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దొపిడీని తొలగించడానికి, రాజకీయ, సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ గురించి ప్రజలకు చెప్పడానికి ప్రతి ఏడాది ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, మహిళల హోదాను ప్రోత్సహించడానికి ఈ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Next Story