ఢిల్లీలో భూకంపం.. భవనాల నుండి బయటకు పరుగులు
ఢిల్లీ పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. బలమైన ప్రకంపనలకు కార్యాలయాలలో
By - అంజిPublished on : 3 Oct 2023 4:07 PM IST
Next Story

ఢిల్లీ పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. బలమైన ప్రకంపనలకు కార్యాలయాలలో ఫ్యాన్లు, లైట్లు వణికిపోయాయి. ఢిల్లీతో పాటు హర్యానా,ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కూడా భూమి కంపించింది. చాలామంది జనం భయంతో పరుగులు పెట్టారు. నేపాల్లో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని నేపాల్లో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయాందోళకు గురయ్యారు.