కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు వ్యతిరేక చర్యను తీవ్రతరం చేసింది. 'ఆపరేషన్ కగర్' మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవ్ రావుతో సహా 27 మంది మావోయిస్టులను భద్రతా దళాలు హతమార్చాయి.
నంబాల కేశవరావు, దళ సభ్యుల మృతికి నిరసనగా జూన్ 10న భారత్ బంద్కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల స్మారక సభలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారని, తాము శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపడం లేదని అన్నారు.