ఓట్ల తొలగింపుపై మమతా బెనర్జీ ఫైర్..ఓటుతోనే ప్రతీకారం తీర్చుకోమంటూ పిలుపు!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు

By -  Knakam Karthik
Published on : 5 April 2026 9:30 PM IST

National News, WestBegal, MamataBanerjee, WestBengalElections2026, TMC, BJP, ElectionCommission, VoterListControversy

ఓట్ల తొలగింపుపై మమతా బెనర్జీ ఫైర్..ఓటుతోనే ప్రతీకారం తీర్చుకోమంటూ పిలుపు!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరుతో లక్షలాది మంది పేర్లను తొలగించారని, దీనికి ప్రతీకారంగా ప్రజలంతా తృణమూల్ కాంగ్రెస్ (TMC) కే ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం భవానీపూర్‌లో 40 వేల పేర్లు, అలాగే తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా తొలగించారని ఆమె ఆరోపించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే ఈ కుట్ర జరుగుతోందని మమత విమర్శించారు. ఈవీఎంలు మొరాయిస్తే రిపేర్ చేయనివ్వవద్దని, కొత్త వాటినే అడగాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. వక్ఫ్ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ వంటి అంశాలపై తాను చేస్తున్న పోరాటం వల్లే బీజేపీ కక్ష సాధింపులకు దిగుతోందని ఆమె మండిపడ్డారు. ముస్లిం ఓట్లను చీల్చేందుకు బీజేపీ కొన్ని పార్టీలతో (AIMIM) కుమ్మక్కైందని ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. తనను ఎదుర్కొనే ధైర్యం ఉంటే నేరుగా పోరాడాలని ఆమె సవాలు విసిరారు.

Next Story