నాతో లైవ్ టీవీ డిబేట్‌లో కూర్చోండి.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ స‌వాల్‌

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తీవ్ర విమర్శలకు దీటుగా స్పందించారు.

By Medi Samrat
Published on : 29 May 2025 8:50 PM IST

నాతో లైవ్ టీవీ డిబేట్‌లో కూర్చోండి.. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ స‌వాల్‌

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తీవ్ర విమర్శలకు దీటుగా స్పందించారు. ఆయనను లైవ్ టీవీ చర్చకు రావాల‌ని సవాలు చేస్తూ.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వాలని బీజేపీని సవాలు చేశారు. నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను, నాతో లైవ్ టీవీ డిబేట్ లో కూర్చోండి. మీరు మీ టెలిప్రాంప్టర్‌ను తీసుకురావచ్చని మమతా బెనర్జీ అన్నారు.

ప్రధానమంత్రి ఆపరేషన్ బెంగాల్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ప్రతిపక్ష నాయకులు ప్రపంచవ్యాప్తంగా జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నిస్తుండ‌గా.. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మమతా విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం 'ఆపరేషన్ సింధూర్' ను ఉపయోగించిందని ఆమె ఆరోపించారు.

Next Story