'ఈ దోపిడీ ఇంకా ఎంతకాలం'.. గ్యాస్ ధర పెంపుపై ఖర్గే మండిపాటు

గ్యాస్‌ సిలిండర్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం కేంద్రంపై మండిపడ్డారు.

By అంజి  Published on  1 March 2023 6:04 AM GMT
Mallikarjun Kharge, gas price hike, central government , National news

గ్యాస్ ధర పెంపుపై ఖర్గే మండిపాటు

హోళీకి ముందు గృహ, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం కేంద్రంపై మండిపడ్డారు. వంటింటి గ్యాస్‌ ధర రూ. 50, కమర్షియల్‌ గ్యాస్‌ ధర రూ. 350 పెరిగిందని, ఇలా అయితే హోళీ వంటకాలు ఎలా చేసుకోవాలని ప్రజలు అడుగుతున్నారని, ఈ దోపిడీ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని ఖర్గే హిందీలో ట్వీట్‌ చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు.

ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యుల నెత్తిపై.. గ్యాస్‌ ధర పెంపుతో మరో పిడుగు పడినట్లైంది. ఇది ప్రజలపై జీవనంపై తీవ్ర ప్రతికూల చూపుతుంది.

బుధవారం (మార్చి 1) నుంచి అమల్లోకి వచ్చేలా వంటింటి వంటగ్యాస్, వాణిజ్య సిలిండర్ల ధరలు వరుసగా రూ.50, రూ.350.50 చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో వంటగ్యాస్ రిటైల్ ధర ఇప్పుడు సిలిండర్‌కు రూ.1,103గా ఉండగా, వాణిజ్య సిలిండర్ ధర రూ.2,119.50గా ఉంది. దేశీయ గ్యాస్ ధరలు చివరిగా జూలై 2022లో సవరించబడ్డాయి. దేశీయ గ్యాస్ సిలిండర్ బరువు 14.2 కిలోలు కాగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ బరువు 19 కిలోలు. ప్రతీ కుటుంబానికి ఏడాదికి 14.2 కిలోల 12 సిలిండర్లు సబ్సిడీ ధరలకు అందజేయబడతాయి. అంతకు మించి కావాలంటే.. వినియోగదారులు మార్కెట్ ధరలో ఎల్‌పిజి సిలిండర్‌ల యొక్క ఏవైనా అదనపు కొనుగోళ్లను చేయవలసి ఉంటుంది.

Next Story