మహా కుంభ మేళాలో రికార్డు..ఇప్పటివరకు 50 కోట్ల మంది పుణ్యస్నానం

జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభ మేళాలో 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

By Knakam Karthik
Published on : 15 Feb 2025 7:44 AM IST

National News, MahaKumbh Mela, Uttarpradesh, Prayagraj

మహా కుంభ మేళాలో రికార్డు..ఇప్పటివరకు 50 కోట్ల మంది పుణ్యస్నానం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభ్ మేళా రికార్డు సొంతం చేసుకుంది. జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభ మేళాలో 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 26వ తేదీ మహా కుంభ మేళా ముగిసేలోపు మొత్తం సంఖ్య 55 నుంచి 60 కోట్లకు మించి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో శుక్రవారం నాడు మొత్తం 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేయడంతో సంగం నగరం ప్రయాగ్‌రాజ్ చరిత్రలో తన పేరును లిఖించుకుని రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమానికి కూడా ఇది అతిపెద్ద సమాజమని అధికారులు తెలిపారు.

మహా కుంభమేళా ప్రారంభంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో 45 కోట్లకు పైగా భక్తులు సంగం నగరాన్ని సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా వేశారు, కాగా అది ఫిబ్రవరి 11 నాటికి ఈ మైలురాయిని సాధించారు. ఫిబ్రవరి 14 నాటికి, స్నానానికి వచ్చే వారి సంఖ్య 50 కోట్లు దాటింది, ఇంకా 12 రోజులు మరియు ఒక అమృత స్నానం మిగిలి ఉంది. మొత్తం సంఖ్య ఇప్పుడు 55 నుండి 60 కోట్లకు మించి పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Next Story