మరో షాక్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంపు

ద్రవ్యోల్బణం నేపథ్యంలో సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది.

By Medi Samrat
Published on : 7 April 2025 4:45 PM IST

మరో షాక్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంపు

ద్రవ్యోల్బణం నేపథ్యంలో సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఉజ్వల పథకం కింద లభించే డొమెస్టిక్ గ్యాస్ ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెరిగింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సోమవారం ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.50 చొప్పున పంపిణీ సంస్థలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉజ్వల, సాధారణ కేటగిరీ వినియోగదారులకు గ్యాస్ ధరను పెంచినట్లు మంత్రి తెలిపారు. సాధారణ వినియోగదారులకు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి, ఉజ్వల పథకం కింద వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్ ధర రూ.503 నుంచి రూ.553కి పెరగనుంది. దీనికి ముందు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ మాట్లాడుతూ “మేము ప్రతి 2-3 వారాలకు ఒక‌సారి సమీక్షిస్తాము. కాబ‌ట్టి, మీరు చూసిన ఎక్సైజ్ సుంకం పెంపుదల భారం పెట్రోల్, డీజిల్‌పై వినియోగదారులపై పడదు. ఆ ఎక్సైజ్ సుంకం పెంపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు గ్యాస్ వైపున నష్టాల్లో ఉన్న రూ. 43,000 కోట్లకు పరిహారం చెల్లించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story