ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసును విచారిస్తున్న రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) ఎంకే నాగ్‌పాల్ మంగ‌ళ‌వారం బదిలీ అయ్యారు

By Medi Samrat  Published on  19 March 2024 3:52 PM GMT
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసును విచారిస్తున్న రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) ఎంకే నాగ్‌పాల్ మంగ‌ళ‌వారం బదిలీ అయ్యారు. న్యాయమూర్తి నాగ్‌పాల్ బ‌దిలీ అనంత‌రం జిల్లా (వాణిజ్య న్యాయస్థానం)-13, సెంట్రల్ ఢిల్లీ, తీస్ హజారీ కోర్టుల న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నాగ్‌పాల్ స్థానంలో కావేరీ బవేజా రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జడ్జి నాగ్‌పాల్ మద్యం పాలసీ కేసును ప్రారంభమైనప్పటి నుంచి విచారిస్తున్నారు.

ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్‌లో ఉన్నారు.

ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బదిలీ పోస్టింగ్ జాబితా ప్రకారం.. ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్ (DHJS)కి చెందిన మొత్తం 27 మంది న్యాయమూర్తులు.. ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు.

Next Story