ప్రియుడి కోసం పాకిస్తాన్‌ వెళ్లిన యువతి.. అక్కడి పోలీసులు ఏం చేశారంటే?

తన స్నేహితుడిని కలిసేందుకు వివాహిత పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

By అంజి  Published on  24 July 2023 1:57 AM GMT
Facebook, friend, India, love, Pakistan

ప్రియుడి కోసం పాకిస్తాన్‌ వెళ్లిన యువతి.. అక్కడి పోలీసులు ఏం చేశారంటే?

ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి ప్రేమలో పడిన తన స్నేహితుడిని కలిసేందుకు వివాహిత అయిన భారతీయ మహిళ పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. 34 ఏళ్ల అంజు ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామంలో జన్మించింది. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివసించింది. ఆమె ఇప్పుడు తన 29 ఏళ్ల ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అప్పర్ దిర్ జిల్లాలో ఉంది. వైద్య రంగంలో పనిచేస్తున్న నస్రుల్లా, అంజు కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారని ఏఆర్‌వై న్యూస్ నివేదించింది. అంజు పాకిస్తాన్‌ని చూడటానికి వచ్చిందని, అతనని పెళ్లి చేసుకోవడానికి కాదని అక్కడి పోలీసులు తెలిపారు.

సదరు భారతీయ యువతి మొదట పోలీసుల అదుపులో ఉంది, అయితే ఆమె ప్రయాణ పత్రాలను జిల్లా పోలీసులు ధృవీకరించిన తర్వాత విడుదల చేశారు. “ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఆమెను వెళ్లేందుకు అనుమతించారు.’’ అని ఒక మూలాధారం పీటీఐకి తెలిపింది. సీనియర్ పోలీసు అధికారి ముష్తాక్ ఖాబ్, స్కౌట్స్ మేజర్ ద్వారా ఆమె పత్రాలను క్లియర్ చేసిన తర్వాత అంజు, ఆమె స్నేహితుడిని విడుదల చేసినట్లు దిర్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు. మీడియాలో కథనాలు రావడంతో రాజస్థాన్ పోలీసుల బృందం భివాడిలోని అంజు ఇంటికి చేరుకుంది. ఆమె జైపూర్‌కు వెళ్లే నెపంతో గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, అయితే ఆమె పాకిస్థాన్‌లో ఉన్నట్లు కుటుంబసభ్యులకు తెలిసిందని ఆమె భర్త అరవింద్ పోలీసులకు తెలిపాడు. “గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయిందని అంజు భర్త చెప్పాడు. ఆమె వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ ఉంది” అని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భివాడి సుజిత్ శంకర్ తెలిపారు.

ఈ విషయమై కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. భివాడిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఈ దంపతులకు 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. తాను లాహోర్‌లో ఉన్నానని తన భార్య అంజు తన సోదరికి చెప్పిందని, తర్వాత తనతో వాట్సాప్ కాల్‌లో మాట్లాడానని అరవింద్ తన ఇంట్లో మీడియాకు తెలిపారు. అతను ఆమెతో మాట్లాడతానని, ఆమెను తిరిగి రావాలని అడుగుతానని చెప్పాడు, ఆమె ఇంటికి తిరిగి వస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆమె విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్నందున 2020లో ఆమెకు పాస్‌పోర్ట్ జారీ చేయబడిందని అతను చెప్పాడు. సోషల్ మీడియాలో ఆమె ఎవరితోనూ టచ్ లో ఉన్నట్లు తనకు తెలియదని అరవింద్ చెప్పాడు. కాగా అంజు వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారతదేశం నుండి చట్టబద్ధంగా పాకిస్తాన్‌కు ప్రయాణించారు.

Next Story