దేశంలో కరోనా కేసులు త‌గ్గుముఖం

India Corona Cases. దేశంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. తాజా బులిటెన్ ప్ర‌కారం..

By Medi Samrat  Published on  10 Dec 2020 5:02 AM GMT
దేశంలో కరోనా కేసులు త‌గ్గుముఖం

దేశంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. తాజా బులిటెన్ ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,521 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,372కు చేరగా.. ఈ మ‌హ‌మ్మారి నుండి 92,53,306 మంది బాధితులు కోలుకున్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,72,293గా వుంది.

ఇక క‌రోనా నుండి నిన్న ఒక్క‌రోజే 37,725 మంది కొత్తగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 412 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య‌ 1,41,772కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.


Next Story