నాణేలతో నామినేషన్ దాఖ‌లు చేసేందుకు వ‌చ్చిన అభ్య‌ర్ధి.. అధికారులకు చెమటలు పట్టించాడు.!

Independent candidate in poll-bound Karnataka hands out election deposit fee in one rupee coins. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్ల దాఖలులో బిజీబిజీగా ఉన్నారు.

By Medi Samrat  Published on  18 April 2023 4:00 PM GMT
నాణేలతో నామినేషన్ దాఖ‌లు చేసేందుకు వ‌చ్చిన అభ్య‌ర్ధి.. అధికారులకు చెమటలు పట్టించాడు.!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్ల దాఖలులో బిజీబిజీగా ఉన్నారు. కర్ణాటకలోని యాద్గిర్ నుంచి మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి అందరి దృష్టిని ఆకర్షించారు. స్వతంత్ర అభ్యర్థి సెక్యూరిటీ మొత్తాన్ని రూపాయి నాణేలలో డిపాజిట్ చేశాడు. మొత్తం 10 వేల రూపాయలను ఒక రూపాయి నాణేలతో డిపాజిట్ చేశాడు. స్వతంత్ర అభ్యర్థి నాణేలతో కూడిన బ్యాగును అధికారుల ముందు ఉంచడంతో అధికారులు ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. ఆ అభ్యర్థి నియోజకవర్గం ఓటర్ల నుంచి ఈ నాణేలను సేకరించారు.

కర్ణాటకలో ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి డిపాజిట్ ఫీజు రూ.10,000. అంటే ఎవరు ఎన్నికల్లో పోటీ చేసినా రూ.10వేలు సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. యాదగిరిలోని కార్యాలయంలో టేబుల్‌పై పడి ఉన్న నాణేలను లెక్కించేందుకు అధికారులకు రెండు గంటల సమయం పట్టింది. యాదగిరి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి యంకప్ప బ్యానర్ పట్టుకుని మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒక్క రూపాయి మాత్రమే కాదు, మీ ఒక్క ఓటు నాకు వేయండి, నేను మిమ్మల్ని పేదరికం నుండి విముక్తి చేస్తానని సందేశం ఉంది. నియోజకవర్గం మొత్తం కాలినడకన పర్యటించి ఓటర్ల నుంచి నాణేలు సేకరించినట్లు అభ్యర్థి తెలిపారు. కలబురగి జిల్లాలోని గుల్బర్గా యూనివర్శిటీలో ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కర్ణాటకలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగ‌నున్నాయి. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న పోలింగ్‌, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.


Next Story