'నేను దొంగను కాను..' కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం మొత్తం కథను వివరించిన విజయ్ మాల్యా
విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం మొత్తం కథను వివరించాడు.
By Medi Samrat
విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం మొత్తం కథను వివరించాడు. భారత్లో జరుగుతున్న న్యాయ పోరాటాలపై ఆయన స్పందించారు. ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాల్యా నేను దొంగను కాను. నేను దొంగతనం చేయలేదు అని గట్టిగా చెప్పారు. అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆయన టార్గెట్ చేశారు.
మార్చి 2016 నుండి నేను ఇండియాకు వెళ్లనందున.. నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలుస్తారని.. కానీ నేను పారిపోలేదని రాజ్ షమానీ పోడ్కాస్ట్లో విజయ్ మాల్యా అన్నారు. నేను ముందుగా నిర్ణయించిన పర్యటనలో భాగంగా భారతదేశం నుంచి వచ్చాను. ఆ సమయంలో నాకు సరైనదని భావించడం, పలు కారణాల వల్ల నేను తిరిగి రాలేదు. అటువంటి పరిస్థితిలో మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే.. పిలవండి.. అయితే దొంగ అని చెప్పడం అంటే ఏమిటి... దొంగతనం ఎక్కడ జరిగింది? అని ప్రశ్నించారు. బ్రిటన్లో ఉండడం వల్ల చట్టపరమైన కేసులు పెరుగుతున్నాయన్న ప్రశ్నకు మాల్యా మాట్లాడుతూ.. భారతదేశంలో న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన జీవితం గురించి నాకు హామీ లభిస్తే ఆలోచిస్తానన్నారు.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం గురించి మాల్యా మాట్లాడుతూ.. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఇది జరిగిందని అన్నారు. లెమాన్ బ్రదర్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? భారత్పై ప్రభావం చూపలేదా? సహజంగానే అది ప్రభావం చూపింది. దీంతో ప్రతి రంగం ప్రభావితమైందన్నారు. డబ్బు ఆగిపోయింది. భారత రూపాయి విలువ కూడా ప్రభావితమైందన్నారు.
కింగ్ ఫిషర్ సంక్షోభానికి సంబంధించి అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని మాల్యా తెలిపారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించాలని, ఉద్యోగులను తొలగించాలని, అలాంటి ఆర్థిక పరిస్థితుల్లో నేను ఆపరేట్ చేయలేనని చెప్పాను. అందుకు ఆయన బ్యాంకుల నుంచి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
సైజు తగ్గించుకోవద్దని చెప్పారని మాల్యా చెప్పారు. బ్యాంకులు మీకు సహకరిస్తాయి. ఇదంతా ఇలా మొదలైంది. ఆ తర్వాత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తన అన్ని విమానాలను నిలిపివేయవలసి వచ్చింది. ఆపై కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కష్టాల్లో ఉంది. లోన్ అడిగిన సమయంలో కంపెనీ పనితీరు కూడా బాగా లేదు అని వివరించారు.