పాక్ ఎయిర్ స్పేస్ ను ఉపయోగించని ఇండియన్ ఎయిర్ ఫోర్స్

IAF not using Pakistan airspace to evacuate Indians from Ukraine. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత వైమానిక దళం(IAF) తమ ప్రయత్నాలను మొదలుపెట్టింది.

By అంజి  Published on  3 March 2022 11:00 AM GMT
పాక్ ఎయిర్ స్పేస్ ను ఉపయోగించని ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత వైమానిక దళం(IAF) తమ ప్రయత్నాలను మొదలుపెట్టింది. అయితే భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ గగనతలాన్ని తప్పించింది. పాక్ ఎయిర్ స్పేస్ ను భారత్ వాడడం లేదు. IAF కు చెందిన నాలుగు C-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు 800 మంది భారతీయులను తిరిగి తీసుకువస్తున్నాయి. పాక్ గగనతలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తానీ గగనతలాన్ని తప్పించడం వలన గరిష్టంగా 25-30 నిమిషాల అదనపు సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు.

ఆపరేషన్ గంగా కార్యక్రమం కింద ఇప్పటికే చాలా మంది విద్యార్థులను భారత్ కు తీసుకుని వస్తున్నారు. 19 విమాన సర్వీసులతో 3,726 మంది విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విమాన సర్వీసులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి నడిపిస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో విద్యార్థులను రోడ్డు మార్గంలో సరిహద్దులు దాటించి, అక్కడికి సమీపంలోని విమానాశ్రయాలకు తరలించారు. 8 విమానాలు బుకారెస్ట్ నుంచి, రెండు విమాన సర్వీసులు సుసేవ నుంచి, కోసీ నుంచి ఒకటి, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్జోవ్ నుంచి 3 విమాన సర్వీసులు బయల్దేరతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రధాని మోదీజీ ఆదేశాలతో ఒక్కరోజే 3,726 మందిని తరలిస్తున్నట్టు చెప్పారు.

Next Story