కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన తర్వాత.. సోనియా గాంధీ ఏమన్నారంటే?

I was waiting for long time.. Sonia on Congress Presidential poll. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఈరోజు, అక్టోబర్ 17న ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

By అంజి  Published on  17 Oct 2022 6:21 AM GMT
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన తర్వాత.. సోనియా గాంధీ ఏమన్నారంటే?

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఈరోజు, అక్టోబర్ 17న ఉదయం 10 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ 137 ఏళ్ల చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు ఓటు వేయాలని తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం అన్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోని బూత్‌లో ఓటు వేసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు.

తాను ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. సోనియా వెంట ఆమె కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ఆమె కూడా ఓటు వేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధులు ఓటింగ్‌లో ఉండగా మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లు పోటీలో ఉన్నారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పి. చిదంబరం తొలి ఓటరు కాగా, ముందస్తు ఓటింగ్‌లో జైరాం రమేష్‌ను అనుసరించారు. శశి థరూర్ మార్పు కోసం పిలుపునిచ్చారు. తనకు ఓటు వేయాలని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

ఇద్దరు పోటీదారుల మధ్య కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు దాదాపు 9,300 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు వేయనున్నారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రకారం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. దాదాపు 67 బూత్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఓటింగ్ ప్రక్రియ ముగియగానే బ్యాలెట్ బాక్సులన్నీ న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువస్తారు. బుధవారం ఓట్ల లెక్కింపు ముగియగానే ఫలితాలు వెల్లడికానున్నాయి.



Next Story