విశాఖ-శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాఖపట్నం మరియు శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By Kalasani Durgapraveen  Published on  26 Oct 2024 6:07 AM GMT
విశాఖ-శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్..  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

విశాఖపట్నం మరియు శంషాబాద్‌లను కలిపే సెమీ-హై-స్పీడ్ రైల్వే కారిడార్ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. సెమీ-హై-స్పీడ్ రైల్ కారిడార్ గరిష్టంగా 220 km/h వేగంతో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రూపొందించారు. ఇది ప్రస్తుత ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటల నుండి కేవలం 4.5 గంటలకు గణనీయంగా తగ్గిస్తుంది. అత్యంత వేగవంతమైన రైలు ప్రయాణం ప్రకారం ప్రస్తుతం 8.5 గంటల ప్రయాణ సమయం పడుతోంది.

ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నంను శంషాబాద్ విమానాశ్రయంతో అనుసంధానించడం, ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ రైలు ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి దాదాపు 8.5 గంటల సమయం పడుతుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, విజయవాడ మార్గంతో పాటు నల్గొండ, గుంటూరు, విజయవాడ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడీ ప్రతిపాదిత లైను మూడోది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. 12 స్టేషన్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలో ఇదే తొలి సెమీ హైస్పీడ్ కారిడార్ కానుంది. ఇక విశాఖపట్టణం నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు. ఇది విశాఖ నుంచి ప్రారంభమై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ మార్గంలో మొత్తం 8 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్ (పెట్) సర్వే తుది దశకు చేరుకుంది. నవంబర్‌లో రైల్వే బోర్డుకు ఈ నివేదికను సమర్పిస్తారు. ఈ సెమీ-హై-స్పీడ్ కారిడార్ ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది.

Next Story