ఔరంగజేబు సమాధి వద్ద భారీ భద్రత

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే పిలుపులు తీవ్రమవుతున్న తరుణంలో, పోలీసు యంత్రాంగం భద్రతను పెంచింది.

By Medi Samrat
Published on : 17 March 2025 9:00 PM IST

ఔరంగజేబు సమాధి వద్ద భారీ భద్రత

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే పిలుపులు తీవ్రమవుతున్న తరుణంలో, పోలీసు యంత్రాంగం భద్రతను పెంచింది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఆ ప్రదేశంలోకి ప్రవేశించే ముందు సందర్శకులు తమ గుర్తింపు కార్డులను అందించడం తప్పనిసరి అని ఒక అధికారి తెలిపారు.

ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వెంటనే ఈ పని చేయకపోతే బాబ్రీ తరహా ఘటన చోటుచేసుకుంటుందని హెచ్చరించాయి. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేసినట్టు ఔరంగజేబ్ సమాధిని కూడా తాము తొలగిస్తామని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. వీహెచ్ పీ, భజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధి వద్ద సెక్యూరిటీని పెంచింది.

Next Story