కేంద్ర సర్కార్ గుడ్న్యూస్.. దివ్యాంగులకు జీవిత కాలం ఫ్యామిలీ పెన్షన్
Government liberalises income criteria for grant of family pension. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగుల కోసం కొత్త కుటుంబ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది.
By Medi Samrat Published on 10 Feb 2021 10:25 AM GMT
liberalizes ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే పెన్షన్ విధానంలో కీలక మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. చనిపోయిన ఉద్యోగి లేదా పెన్షనర్ పిల్లలకు మానసిక లేదా శారీరక వైకల్యాలు ఉండి దీర్ఘకాలిక వైద్యం అవసరమైతే వారికి జీవితాంతం పెన్షన్ ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం సోమవారం నుంచే అమల్లోకి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ కుటుంబ సభ్యులకు, వారి ప్రస్తుత వార్షిక ఆదాయాన్ని బట్టి పెన్షన్ ఇచ్చే వారు. ఇకపై ఈ విధానంలోనే ఇప్పుడు మార్పులు చేసి దివ్యాంగులైన కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్ వచ్చేలా రూపకల్పన చేశారు. సాధారణ కుటుంబ సభ్యులు, వైకల్యం ఉన్న సంతానం అనే రెండు వర్గాలుగా మార్చారు. 1972లో సీసీఎస్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఉద్యోగి మొత్తం ఆదాయం, కుటుంబ పెన్షన్ కాకుండా సాధారణ రేటుతో కుటుంబ పింఛన్ను కంటే తక్కువగా ఉంటుంది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ డ్రా చేసిన చివరి వేతనంలో 30 శాతం అందించే కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. అలాగే కుటుంబ పెన్షనర్ మరణించిన సమయంలో పెన్షన్ మంజూరు చేయడానికి ఇతర షరతులను కూడా నెరవేర్చింది.